News May 22, 2024
ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా?

మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావొచ్చు. పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. వీలైనంతగా ఫోన్ను దూరంగా ఉంచాలి. అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు.
Similar News
News February 2, 2026
జగిత్యాల: ఎస్పీగా శేషాద్రిని రెడ్డి పదోన్నతి

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఎస్పీగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘పిప్పింగ్’ కార్యక్రమం నిర్వహించారు. శేషాద్రిని రెడ్డి భుజాలపై ఎస్పీ అశోక్ కుమార్ స్టార్ చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీపై వెళ్తున్న శేషాద్రిరెడ్డిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన సూచించారు.
News February 2, 2026
నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు ఏం చేశారంటే?

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.
News February 2, 2026
సరస్వతీ దేవి వీణాగానం కన్నా తీయనైంది..

లలితా దేవి కొలువులో సరస్వతీ దేవి తన వీణతో అమృతతుల్యమైన సంగీతాన్ని వినిపించగా, ముక్కోటి దేవతలు పరవశించిపోయారు. ఆ గానాన్ని మెచ్చిన లలితాంబిక ‘బాగుంది’ అని పలికింది. ఆ ఒక్క మాటలోని మాధుర్యం, తన వీణా స్వరాల కంటే మిన్నగా ఉందని గ్రహించిన సరస్వతి దేవి వినమ్రంగా తన వీణను పక్కన పెట్టేసింది. సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతి వీణ నాదాన్ని సైతం మించిపోయేంత కమ్మని కంఠస్వరం లలితా దేవిది.


