News October 25, 2025

పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

image

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే చాలామంది పిల్లలకు సంవత్సరం దాటిన తర్వాత పెద్దవాళ్ల సబ్బులు వాడతారు. ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్‌, మినరల్‌ ఆయిల్స్‌, సల్ఫేట్స్‌ లేకుండా చూసుకోవాలంటున్నారు.

Similar News

News October 25, 2025

తక్కువ నీటి నిల్వ శక్తి గల భూముల్లో దిగుబడి పెరగాలంటే?

image

కొన్ని భూములకు నీటిని నిల్వ చేసుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం వీటిలో ఇసుక శాతం అధికంగా ఉండటంతో పాటు బంక మన్ను 20 శాతం కంటే తక్కువగా ఉండటమే. దీని వల్ల భూమిలో నీరు నిల్వ ఉండక, పోషకాలు మొక్కలకు అందక పంట దిగుబడి తగ్గుతుంది. ఇలాంటి భూముల్లో ఎకరాకు 40 టన్నుల చౌడు స్వభావం లేని చెరువు మట్టిని వేయడం ద్వారా పై సమస్యను అధిగమించి మంచి దిగుబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News October 25, 2025

ఇంటి చిట్కాలు

image

* 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో 1 వంతు గోరువెచ్చని నీళ్లు పోసి క్లీనర్ రెడీ చేసుకోవాలి. దీంతో ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఫ్యాన్లు, ఏసీలపై మరకలు సులువుగా పోతాయి
* క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌ను స్టీలు స్క్రబ్బర్‌తో గట్టిగా తోమితే కుక్‌వేర్ పొర పోవచ్చు. వీటిని స్పాంజ్ స్క్రబ్బర్‌తో మైల్డ్ డిష్ సోప్ ఉపయోగించి తోమాలి.
* షవర్ జామ్ అయితే కాస్త వెనిగర్, నీళ్లు కలిపి దానికి పట్టేలా రాసి, గంట తర్వాత కడిగేయాలి.

News October 25, 2025

అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీ ప్రజలు!

image

దేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పులు ఎక్కువగా చేస్తున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదిక వెల్లడించింది. AP తొలి స్థానంలో, తెలంగాణ రెండో ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. 2020-21 లెక్కల ప్రకారం ఏపీలో 43.7%, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో చిక్కుకున్నారు. కేరళ(29.9), తమిళనాడు(29.4), కర్ణాటక (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో అత్యల్పంగా 3.2%, ఛత్తీస్‌గఢ్‌లో 6.5% మంది ఉండటం గమనార్హం.