News March 18, 2024
నీటి ఆదాకు డాక్టర్ టిప్స్

కర్ణాటకలో కొన్ని రోజులుగా నీటి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీటి ఆదా విషయంలో బెంగళూరు డాక్టర్ దివ్యశర్మ తాను పాటించిన టిప్స్ చెప్పారు. ఓవర్ హెడ్ షవర్ల తొలగింపు, కుళాయిల నుంచి నీరు ధారగా పడకుండా ఏరేటర్స్ ఏర్పాటు, ప్యూరిఫయర్ నుంచి వచ్చే నీటితో ఇల్లు తుడవడం, మొక్కలకు వాడటం, కార్ వాషింగ్ ఆపేసి తడి వస్త్రంతో శుభ్రం చేశామని చెప్పుకొచ్చారు. డాక్టర్ టిప్స్ను పలువురు స్వాగతిస్తున్నారు.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


