News October 21, 2024
క్యారెట్లు ఎక్కువగా తింటే చర్మం రంగు మారుతుందా..?
క్యారెట్లు మరీ ఎక్కువగా తింటే మనిషి చర్మం స్వల్పంగా ఆరెంజ్ కలర్లోకి మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని కెరోటెనీమియాగా వ్యవహరిస్తారు. క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పిగ్మెంట్ మనిషి శరీరంలో విటమిన్-ఏగా మారుతుంది. పిగ్మెంట్ స్థాయి మోతాదుకి మించితే రక్త ప్రసరణలోకి చేరుతుంది. అది ఇంకా పెరిగితే దేహం ఆరెంజ్ కలర్లో కనిపించొచ్చని, కానీ ప్రమాదకరమేమీ కాదని నిపుణులు తెలిపారు.
Similar News
News October 21, 2024
నవంబర్ 1న ‘మూరత్’ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ‘మూరత్’ ట్రేడింగ్ను నవంబర్ 1న సా.6-7 గంటల మధ్య నిర్వహించనున్నట్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. హిందూ కాలమానం ప్రకారం ఆరోజు నుంచి ‘సంవత్ 2081’ ప్రారంభం అవుతుంది. మదుపరులు, బ్రోకర్లకు మూరత్ ట్రేడింగ్ భోగభాగ్యాలు ప్రసాదిస్తుందని విశ్వాసం. అందుకే చాలామంది ఆరోజు కనీసం ఒక్క షేర్ అయినా కొనుగోలు చేయాలని చూస్తారు. అంతకుముందు రోజు(దీపావళి-అక్టోబర్ 31)న ప్రీఓపెనింగ్ సెషన్ ఉంటుంది.
News October 21, 2024
KCR ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు: కోదండరాం
TG: రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని, KCR ఒక్కడి వల్లే రాలేదని MLC కోదండరాం అన్నారు. నిజామాబాద్ TNGOs భవన్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ కోసం ఎన్నో సంఘాలు ఉద్యమించాయి. ఎందరో బలిదానాలు చేయడంతో రాష్ట్రం సిద్ధించింది. KCR తన స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారు. పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యలను BRS తీర్చలేదు’ అని ఆయన విమర్శించారు.
News October 21, 2024
రేషన్ కార్డులపై శుభవార్త?
TG: రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లు చేర్చడంపై ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించనుంది. కుటుంబంలో పిల్లలు, కోడలు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పేర్లు చేర్చాలని దరఖాస్తు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం పూర్తయ్యాక పేర్లు నమోదు చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం.