News July 17, 2024

బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా?

image

బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందనేది అపోహ మాత్రమేనని BBC పేర్కొంది. బల్లుల్లో మనిషిని చంపేంత విషం ఉండదని పరిశోధనలు చెబుతున్నాయంది. అయితే బల్లి పడిన ఆహారాన్ని తీసుకున్నామనే అలర్జీ వల్లే వాంతులు, తలనొప్పి వస్తాయంది. ఈ సమస్యను మందులతో తగ్గించుకోవచ్చని వివరించింది. బల్లుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, అవి లేకపోతే కీటకాల సంఖ్య పెరిగి పరిస్థితి భయానకంగా మారుతుందని తెలిపింది.

Similar News

News November 20, 2025

శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

image

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.

News November 20, 2025

నటి మృతి.. అసలేం జరిగింది?

image

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్‌లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.

News November 20, 2025

సంతానలేమికి ముందే హెచ్చరికలు

image

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.