News August 6, 2024
జగన్కు 980 మందితో భద్రత అవసరమా?: అనిత

AP: మాజీ సీఎం వైఎస్ జగన్కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఆయనకు 980 మందితో భద్రత అవసరమా అని ఆమె ప్రశ్నించారు. ‘రాజకీయ లబ్ధి కోసమే తన భద్రత, ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు వెళ్లారు. అంతేకానీ ఆయన ప్రజా సమస్యలపై కోర్టుకు వెళ్లటం లేదు. పులివెందులలోని జగన్ బాధితులు ప్రజాదర్బార్కు వచ్చి మొరపెట్టుకుంటున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Similar News
News April 17, 2026
సౌత్ vs నార్త్ అంటూ దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదు: షా

ఉత్తర, దక్షిణ భేదాలు చూపి దేశాన్ని ముక్కలు చేస్తామంటే కుదరదని కేంద్రమంత్రి అమిత్ షా డీఎంకేని ఉద్దేశించి LSలో వ్యాఖ్యానించారు. ‘డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు. దక్షిణమే కాదు యూటీలకు సైతం దేశంపై అదే హక్కు ఉంటుంది. కరోనా కారణంగా 2021లో జనగణన చేయలేకపోయాం. ఇప్పుడు అందరి సూచనలతో చేస్తున్నాం. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో సీట్లు పెరుగుతాయి’ అని తెలిపారు.
News April 17, 2026
తగ్గేదేలే.. లూసిఫర్-3 కచ్చితంగా చేస్తా: పృథ్వీరాజ్

ఒకట్రెండు కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత లూసిఫర్-3ని కచ్చితంగా తీస్తానని నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. మోహన్ లాల్ డేట్స్ కుదరడమూ ముఖ్యమని పేర్కొన్నారు. ‘L2: ఎంపురాన్’ సినిమా కొద్ది మందికి నచ్చకపోయినా తన నిబద్ధత తగ్గదని చెప్పారు. ఆ చిత్రంలో <<15958942>>గుజరాత్ అల్లర్ల ప్రస్తావనపై<<>> స్పందిస్తూ ‘రాజకీయ ప్రయోజనాల కోసం రూ.కోట్లు పెట్టి సినిమా తీసే వ్యక్తిని కాదు’ అని స్పష్టం చేశారు.
News April 17, 2026
డీలిమిటేషన్.. పాకిస్థాన్కు భారత్ వార్నింగ్

డీలిమిటేషన్ బిల్లులో J&K అసెంబ్లీలో <<19661636>>POKకు 24 సీట్లను<<>> కేంద్రం రిజర్వ్ చేయడాన్ని రెచ్చగొట్టే చర్యగా పాక్ విమర్శించింది. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. భారత సార్వభౌమాధికారంలో భాగంగా పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలపై నిర్ణయాలు తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇందులోకి చొరబడే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికింది.


