News September 4, 2024

రాష్ట్ర ప్రజల కష్టాలు మోదీకి కనిపించడం లేదా?: షర్మిల

image

AP: రాష్ట్రంలో ఘోర విపత్తు సంభవించిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వరదలతో ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రధాని మోదీకి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. ‘ఇక్కడి ఎంపీల మద్దతుతోనే ప్రధాని అయ్యాననే సంగతి మోదీ మర్చిపోయారు. ఇంతటి విపత్తు సంభవిస్తే కనీస స్పందన లేదు. ప్రధాని స్పందించి రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News November 3, 2025

కంకరలో కూరుకుపోయి ఊపిరి ఆగి..

image

TG: రంగారెడ్డి జిల్లాలో జరిగిన <<18183371>>బస్సు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య భారీగా ఉండడానికి కంకరే కారణమని తెలుస్తోంది. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో అందులోని కంకర మొత్తం బస్సులో కుడివైపు కూర్చున్న ప్రయాణికులపై పడింది. అందులో కూరుకుపోవడంతో ఊపిరి తీసుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలినట్లు సమాచారం. బస్సులో ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

News November 3, 2025

కొన్ని క్యాచులు ట్రోఫీలను గెలిపిస్తాయి!

image

క్రికెట్‌లో క్యాచులు మ్యాచులనే కాదు.. <<18182320>>వరల్డ్ కప్‌<<>>లను కూడా గెలిపిస్తాయి. 1983WC ఫైనల్లో కపిల్ దేవ్ వివ్ రిచర్డ్స్(WI) క్యాచ్‌ పట్టి తొలి ట్రోఫీని అందించారు. 2024-T20WC ఫైనల్లో డేవిడ్ మిల్లర్(SA) ఇచ్చిన క్యాచ్‌ను సూర్యకుమార్ చాకచక్యంగా అందుకోవడంతో కప్ సొంతమైంది. తాజా WWCలో SA కెప్టెన్ లారాను అమన్‌జ్యోత్ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు అపూర్వ విజయం దక్కింది.

News November 3, 2025

APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

image

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్‌ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.