News September 25, 2024
మూసీకి రూ.లక్షన్నర కోట్లు అవసరమా?: KTR

TG: హైదరాబాద్లో హైడ్రా పేరుతో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం జరుగుతోందని మాజీ మంత్రి KTR ఆరోపించారు. ‘CM సోదరులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా? హైడ్రా పేరుతో ఎక్కువగా పేదల ఇళ్లే కూలుస్తున్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి. మూసీ సుందరీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతోంది. పాకిస్థాన్ కంపెనీలకు టెండర్లు ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు అవసరమా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 19, 2025
కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్హెచ్బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్హెచ్బీ కోచ్లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
News November 19, 2025
మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>
News November 19, 2025
కాకినాడ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

కాకినాడ టౌన్ నుంచి బెంగళూరు వరకు నడిచే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (LHB) కోచ్లను అమర్చనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఈ ఎల్హెచ్బీ బోగీలు జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడున్న ఐసీఎఫ్ బోగీలతో పోలిస్తే, ఈ ఎల్హెచ్బీ కోచ్లు మరింత సౌకర్యవంతంగా, గరిష్టంగా 160 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.


