News August 3, 2024
NEET PG ఔత్సాహికులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పనుందా?

తమ ఇళ్ల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో NEET PG ఔత్సాహికులు తీవ్ర నిరాశ చెందారు. దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత నగరానికి బదులు దూరంగా ఉన్న కేంద్రాలను ఎలా కేటాయిస్తారని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో IMA జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసింది. చర్చలైతే విజయవంతంగా పూర్తయ్యాయని, అనుకూలంగా నిర్ణయం రావాలని కోరుకుందామని ఓ మెంబర్ తెలిపారు.
Similar News
News February 24, 2026
ఇందాపూర్తో హెరిటేజ్కు సంబంధం లేదు: CBN

AP: హెరిటేజ్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని CM CBN అసెంబ్లీలో మండిపడ్డారు. ‘నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఏ దేవాలయానికి పాలు, నెయ్యి సరఫరా చేయొద్దని నిర్ణయించుకున్నాం. ఇందాపూర్తో హెరిటేజ్కు సంబంధమే లేదు. వాళ్లు మదర్ డెయిరీ, పతంజలి, డీమార్ట్, రిలయన్స్, హెరిటేజ్కు కో- మాన్యుఫాక్చరింగ్ చేస్తున్నారు. మీరు చేసిన తప్పును తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి’ అని YCP నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
News February 24, 2026
కీరదోసలో గుమ్మడి పెంకు పురుగు – నివారణ

కీరదోస మొక్కలు మొలకెత్తిన తర్వాత గుమ్మడి పెంకు పురుగులు లేత ఆకులను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ సమయంలో ఈ పురుగుల నివారణకు ట్రైక్లోఫోరాన్ (5%) పొడిమందును చల్లాలి. 10 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. అలాగే తీగ పాకే సమయంలోనూ ఈ పెంకు పురుగులు పంటను ఆశించి ఆకులకు నష్టం కలిగిస్తాయి. అప్పుడు వాటి నివారణకు లీటరు నీటికి డైక్లోరోవాస్ 1.2ml లేదా ట్రైకోఫోరాన్ 2ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News February 24, 2026
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


