News August 3, 2024
NEET PG ఔత్సాహికులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పనుందా?

తమ ఇళ్ల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో NEET PG ఔత్సాహికులు తీవ్ర నిరాశ చెందారు. దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత నగరానికి బదులు దూరంగా ఉన్న కేంద్రాలను ఎలా కేటాయిస్తారని నెట్టింట ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో IMA జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసింది. చర్చలైతే విజయవంతంగా పూర్తయ్యాయని, అనుకూలంగా నిర్ణయం రావాలని కోరుకుందామని ఓ మెంబర్ తెలిపారు.
Similar News
News March 6, 2026
మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్ఫెడ్కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.
News March 6, 2026
రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

రష్యా ఆయిల్ కొనేందుకు 30 రోజుల పాటు భారత్కు US తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందని ఆ దేశ ఉన్నతాధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ దీనికి అంగీకరించినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్ను కొనేందుకే అనుమతి ఇచ్చినట్లు చెప్పింది. కాగా భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలే ఉన్నట్లు తెలుస్తోంది.
News March 6, 2026
ప్రైవేట్ స్కూళ్లకు ‘ప్రొఫెషనల్’ షాక్

TG: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. వసూలు చేసే బాధ్యత డీఈవోలకు అప్పగిస్తూ నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 11 వేల ప్రైవేటు స్కూళ్లలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించే పనిలో ఉంది.


