News September 20, 2024
నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు

దలాల్ స్ట్రీట్లో బుల్ రంకెలేసింది. గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వద్ద, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.
Similar News
News November 7, 2025
MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.
News November 7, 2025
డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

AP: తిరుమలలో DEC 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు EO అనిల్ సింఘాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి టోకెన్ల జారీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చామని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన 2026 FEB నుంచి ఆన్లైన్ కోటా రిలీజ్ చేస్తామన్నారు.
News November 7, 2025
ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో డెడ్లైన్ ముగియగా ఈనెల 17 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు కోసం <


