News September 5, 2024

వరద బాధితులకు రూ.11కోట్ల విరాళం

image

TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(TG) ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు, అరబిందో ఫార్మా రూ.5కోట్లు, AIG హాస్పిటల్స్ రూ.కోటి విరాళం ఇచ్చాయి. ఈ మేరకు చెక్కులను సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టికి అందజేశాయి. మొత్తంగా రూ.11కోట్లు CMRFకు అందాయి.

Similar News

News January 2, 2026

పవన్‌ హక్కుల ఉల్లంఘన పోస్టులు తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు

image

AP Dy CM <<18640929>>పవన్<<>> కళ్యాణ్ వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పవన్ అభిమానులు కూడా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. SM వినియోగదారులు అభిమానుల ఖాతాల ద్వారా వాటిని పోస్టు చేస్తున్నారన్న వాదనను తిరస్కరించింది. కాగా పవన్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని మెటా, గూగుల్, ఎక్స్ సంస్థలను కోర్టు ఆదేశించింది.

News January 2, 2026

వరి మాగాణి మినుమును ఆశించే తెగుళ్లు

image

రబీ కాలంలో వరి మాగాణి భూముల్లో నాటిన మినుము పంటకు అనేక తెగుళ్ల బెడద ఉంటుంది. ముఖ్యంగా పైరు 35 నుంచి 40 రోజుల దశలో కొరినోస్పొరా ఆకుమచ్చ తెగులు, 45 నుంచి 50 రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో తుప్పు తెగుళ్లు సోకే అవకాశం ఉంటుంది. మెరుగైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగుళ్లను సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. తెగులు సోకిన చాలా రోజుల తర్వాత మందును పిచికారీ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదు.

News January 2, 2026

ఒత్తిడిని ఇలా తగ్గించేద్దాం..

image

అధిక ఒత్తిడినించి బైట పడాలంటే చిన్న చిన్న పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆలోచనలు నెమ్మదిస్తాయి. డీప్‌ బ్రీతింగ్స్‌ తీసుకోవాలి. ముక్కు ద్వారా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. చాలామంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని అనుకుంటారు. కానీ దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. కాబట్టి కొన్ని విషయాలు యాక్సెప్ట్‌ చేయడం అలవాటు చేసుకుంటేనే శరీరం, మనస్సు రిలాక్స్‌ అవ్వడం ప్రారంభిస్తాయి.