News November 14, 2024
శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం

AP: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు.
Similar News
News January 1, 2026
ఎల్లుండే టీమ్ ప్రకటన.. షమీ రీఎంట్రీ?

న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును ఈ నెల 3న BCCI ఎంపిక చేయనుంది. ఇటీవల సౌతాఫ్రికాతో మ్యాచులకు దూరమైన గిల్ తిరిగి టీమ్లోకి రానున్నారు. సీనియర్ ప్లేయర్లు హార్దిక్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ ఈ సిరీసూ ఆడబోరని సమాచారం. ఎన్నాళ్ల నుంచో కమ్బ్యాక్ కోసం చూస్తున్న షమీ రీఎంట్రీ ఇవ్వొచ్చు. సర్ఫరాజ్కూ చోటు దక్కే ఛాన్స్ ఉంది. JAN 11న తొలి వన్డే జరగనుంది.
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్.. రీడింగ్ చూస్తే షాకే!

TG: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ మందుబాబు రీడింగ్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. నిన్న రాత్రి వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తికి బ్రీత్ అనలైజర్తో చెక్ చేయగా ఏకంగా 438 రీడింగ్ నమోదైంది. న్యూఇయర్ వేళ డ్రంకెన్ డ్రైవ్లో నమోదైన రీడింగ్ల్లో ఇదే అత్యధికమని ఏఎస్పీ శుభం ప్రకాశ్ తెలిపారు. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
News January 1, 2026
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవా

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.


