News November 14, 2024
శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం

AP: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు.
Similar News
News January 29, 2026
ఈసారి ₹3.5 లక్షల కోట్లతో బడ్జెట్!

AP: FY26-27కి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. పెద్దఎత్తున పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు వస్తుండడమే దీనికి కారణం. Fy25-26లో బడ్జెట్ ₹3,22,359.33cr కాగా ఈసారి ₹3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో ₹48,341cr కాగా ఈసారి ₹60000crకు పెరుగుతుందని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు FEB 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
News January 29, 2026
రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యాన్స్ను షాక్కు గురిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన ప్రయాణానికి పూర్తి భిన్నమైన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. WBకు చెందిన ఆయన కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలను పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోరని సమాచారం.
News January 29, 2026
ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.


