News August 22, 2025
ఆ కుక్కలను వదలకండి: సుప్రీంకోర్టు

ఢిల్లీలో వీధికుక్కలపై ఆగస్టు 11న ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. షెల్టర్లకు తరలించిన కుక్కలకు స్టెరిలైజ్, ఇమ్యునైజేషన్ తర్వాత బయట ప్రదేశాల్లో వదిలేయాలని సూచించింది. రేబిస్ సోకిన, దూకుడుగా ఉండే కుక్కలను వదలవద్దని ఆదేశించింది. వీధికుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని ఆదేశించింది. ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.
Similar News
News March 27, 2026
పారాక్వాట్ను బ్యాన్ చేయండి.. PM, CMకు నటుడి విజ్ఞప్తి

TG: కలుపు నివారణకు వాడే పారాక్వాట్(గడ్డి మందు)ను బ్యాన్ చేయాలని నటుడు రాహుల్ రామకృష్ణ ప్రధాని మోదీ, సీఎం రేవంత్కు విజ్ఞప్తి చేశారు. దాన్ని తాగి తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మందు సులభంగా దొరకడం వల్ల దుర్వినియోగం జరుగుతోందన్నారు. కాగా ఈ మందు విక్రయాలపై ప్రభుత్వం ఇప్పటికే <<19342790>>నియంత్రణ చర్యలు<<>> చేపట్టింది.
News March 27, 2026
ఏప్రిల్ 21లోగా ఇంటర్ ఫలితాలు!

AP: ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే తొలి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
News March 27, 2026
ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.


