News January 31, 2025
టీమ్ ఇండియాతో ఫ్రెండ్లీగా ఉండొద్దు.. పాక్ ఆటగాళ్లకు హెచ్చరిక

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచుల్లో భారత ఆటగాళ్లతో స్నేహంగా ఉండొద్దని పాక్ మాజీ ఆటగాడు మోయిన్ ఖాన్ తమ క్రికెటర్లను హెచ్చరించారు. ‘ఈ మధ్యకాలంలో మనవాళ్ల వైఖరి నాకు అర్థం కావట్లేదు. భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే వెళ్లి వారి బ్యాట్లను చెక్ చేయడం, ఫ్రెండ్లీగా మాట్లాడటం వంటివి చేస్తున్నారు. గౌరవం ఇవ్వడం వరకూ ఓకే కానీ ఈ అతి స్నేహం దేనికి?’ అని ప్రశ్నించారు. వచ్చే నెల 23న దుబాయ్లో భారత్-పాక్ తలపడనున్నాయి.
Similar News
News November 27, 2025
సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్తో ఈజీగా..

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.


