News September 21, 2025
‘తిరుమలలో తొక్కిసలాట’ ప్రచారం నమ్మవద్దు: TTD

AP: తిరుమలలో తొక్కిసలాట అని, తిరుపతిలోని కపిలతీర్థంలో ఏర్పాట్లు చేయలేదని SMలో జరుగుతున్న ప్రచారాన్ని TTD ఖండించింది. ‘మహాలయ అమావాస్య వేళ కపిలతీర్థం ఆలయం బయట పితృతర్పణాలు జరపడం ఆనవాయితీ. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఎస్పీ, పోలీస్ వాహనాలు రావడం చూసి తొక్కిసలాట అని ప్రచారం చేస్తున్నారు. TTDపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది.
Similar News
News September 21, 2025
శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా: TDP

AP: జగన్ హయాంలో పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు? అని వైసీపీ నేతలను TDP ప్రశ్నించింది. ‘దొంగతనం చేసిన వాడిని శిక్షించకుండా, రాజీ ఎందుకు కుదిర్చారు? దొరికిన దొంగకు చెందిన ఆస్తులు, ఎవరి పేరున రిజిస్టర్ చేయించారు? చిన్న దొంగలు, పెద్ద దొంగలు కలిసి శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా? హైకోర్టు తీర్పుతో జగన్ హయాంలో జరిగిన పాపం పండింది’ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.
News September 21, 2025
పంజాబ్ & సింధ్ బ్యాంక్లో 190 పోస్టులు

<
News September 21, 2025
మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.