News September 21, 2025

‘తిరుమలలో తొక్కిసలాట’ ప్రచారం నమ్మవద్దు: TTD

image

AP: తిరుమలలో తొక్కిసలాట అని, తిరుపతిలోని కపిలతీర్థంలో ఏర్పాట్లు చేయలేదని SMలో జరుగుతున్న ప్రచారాన్ని TTD ఖండించింది. ‘మహాలయ అమావాస్య వేళ కపిలతీర్థం ఆలయం బయట పితృతర్పణాలు జరపడం ఆనవాయితీ. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఎస్పీ, పోలీస్ వాహనాలు రావడం చూసి తొక్కిసలాట అని ప్రచారం చేస్తున్నారు. TTDపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించింది.

Similar News

News September 21, 2025

శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా: TDP

image

AP: జగన్ హయాంలో పరకామణిలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం వెనుక ఉన్నది ఎవరు? అని వైసీపీ నేతలను TDP ప్రశ్నించింది. ‘దొంగతనం చేసిన వాడిని శిక్షించకుండా, రాజీ ఎందుకు కుదిర్చారు? దొరికిన దొంగకు చెందిన ఆస్తులు, ఎవరి పేరున రిజిస్టర్ చేయించారు? చిన్న దొంగలు, పెద్ద దొంగలు కలిసి శ్రీవారి హుండీ సొమ్ము నొక్కేసింది వాస్తవం కాదా? హైకోర్టు తీర్పుతో జగన్ హయాంలో జరిగిన పాపం పండింది’ అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

News September 21, 2025

పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 190 పోస్టులు

image

<>పంజాబ్ <<>>& సింధ్ బ్యాంక్‌ 190 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు OCT 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(అగ్రికల్చర్, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హజ్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్), CA/CMA, CFMA/MBA(ఫైనాన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News September 21, 2025

మరికాసేపట్లో మోదీ ప్రసంగం.. ఉత్కంఠ

image

మరికాసేపట్లో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, GST సంస్కరణలు అమల్లోకి రానుండటం తెలిసిందే. ఈ అంశాలపైనే మాట్లాడతారా లేదా మరేదైనా సంచలన ప్రకటన చేస్తారా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అమెరికా టారిఫ్స్‌తో పాటు H-1B వీసా ఫీజు పెంపుపై స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 5PMకు మోదీ ప్రసంగాన్ని Way2Newsలో లైవ్ చూడండి.