News November 1, 2024
ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. మానవత్వం ఉంది: చంద్రబాబు

AP: దేశంలో రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మానవత్వం ఉందని చెప్పారు. ‘సిలిండర్కు చెల్లించిన డబ్బులను 48 గంటల్లోనే రీఫండ్ చేస్తాం. అసలు సిలిండర్కు ముందే డబ్బు కట్టే పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పూర్వవైభవం తీసుకువస్తాం. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News February 10, 2026
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 10, 2026
‘ఫోర్ స్టార్స్’ పుస్తకం మేం అమ్మలేదు: పెంగ్విన్

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం లోక్సభలో దుమారం రేపడం తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే <<19096489>>బుక్ బయటికి రావడం<<>>తో ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. ‘బుక్ రైట్స్ మావే. కానీ డిజిటల్/ప్రింట్ రూపంలో రిలీజ్ చేయలేదు. డిస్ట్రిబ్యూట్, సేల్ చేయలేదు’ అని స్పష్టంచేసింది. పుస్తకాన్ని చట్టవిరుద్ధంగా సర్క్యులేట్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
News February 10, 2026
నిర్భయలా మరణించి ఉంటే నమ్మేవారేమో.. ఉన్నావ్ రేప్ బాధితురాలు

ఉన్నావ్ రేప్ కేసు నిందితుడు కుల్దీప్ సెంగార్ (ఫొటోలో)కు సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించడంపై బాధితురాలు సంతోషం వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో 3నెలల్లో వాదనలు పూర్తి చేయాలని జడ్జి ఆదేశించడం సంతృప్తినిచ్చింది. నిందితుడి సోదరుల చేతిలో మరణించిన నా తండ్రి తిరిగి రాలేడు. నాపై జరిగిన రేప్ కేసులో న్యాయం కోసం 8ఏళ్లుగా పోరాడుతున్నా. బహుశా నిర్భయ లాగా మరణించి ఉంటే నమ్మేవారేమో’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


