News April 18, 2024
చంద్రబాబు మాదిరి ‘గ్రాఫిక్స్’ చూపి మోసం చేయం: బొత్స

AP: రాజకీయాల్లో చంద్రబాబుకు, ఊసరవెల్లికి తేడా లేదని, స్టేజీ మారితే ఆయన మాట మారుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. TDP చీఫ్ మాదిరి గ్రాఫిక్స్ చూపించి మోసం చేసే ప్రభుత్వం తమది కాదన్నారు. ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో భోగాపురం ఎయిర్పోర్టు పనులు జరుగుతున్నాయని తెలిపారు. విశాఖ మెట్రో రైలు DPR రెడీ అయ్యిందని చెప్పారు. వైజాగ్ పరిపాలనా రాజధానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Similar News
News October 25, 2025
బిహార్లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
News October 25, 2025
పశుగ్రాస విత్తనాలు, పశుగణ బీమాకు నిధులు విడుదల

AP: పశుగణ బీమా, నాణ్యమైన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్(NLM) కింద ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
News October 25, 2025
సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.


