News April 18, 2024
మ.3 గంటల వరకు బయటికి రావొద్దు: వాతావరణ శాఖ

AP: రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో 42-45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. కాగా నిన్న అత్యధికంగా కడప జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 18, 2025
HEALTH: ఇవి పాటిస్తే రోగాలు దూరం!

* ఆరోగ్యకరమైన కిడ్నీల కోసం పుష్కలంగా నీరు తాగండి
* గుండె ఆరోగ్యం కోసం అధికంగా ఉప్పు తినకూడదు
* పొగ తాగకుండా ఉంటే మీ ఊపిరితిత్తులు సేఫ్
* రోజూ 8 గంటలు నిద్రపోతే మెదడు ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేస్తుంది
* పొట్ట ఆరోగ్యం కోసం ఐస్క్రీమ్స్, చల్లని పదార్థాలు తినడం మానేయాలి
* మూత్రనాళం ఆరోగ్యానికి పచ్చి ఉల్లిపాయలు మంచివని వైద్యులు చెబుతున్నారు.