News April 18, 2024

మ.3 గంటల వరకు బయటికి రావొద్దు: వాతావరణ శాఖ

image

AP: రాష్ట్రం నిప్పులకొలిమిని తలపిస్తోంది. అన్ని ప్రాంతాల్లో 42-45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. కాగా నిన్న అత్యధికంగా కడప జిల్లా కొంగలవీడులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News December 6, 2025

చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

image

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

News December 6, 2025

US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

image

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.

News December 6, 2025

చెలరేగిన ప్రసిద్ధ్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు

image

SAతో ODI సిరీస్‌లో పేలవ బౌలింగ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న IND బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎట్టకేలకు రిథమ్ అందుకున్నారు. విశాఖలో జరుగుతున్న 3వ ODIలో ఫస్ట్ 2ఓవర్లలో 27రన్స్ సమర్పించుకున్న ఆయన.. తన సెకండ్ స్పెల్‌లో ఒకే ఓవర్‌లో బ్రిట్జ్‌కే, మార్క్రమ్‌ను, అనంతరం డికాక్‌(106)ను క్లీన్‌బౌల్డ్‌ చేశారు. ప్రస్తుతం 7 ఓవర్లలో 52 పరుగులిచ్చి వికెట్లు పడగొట్టారు. అటు కుల్దీప్ సైతం ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు.