News July 20, 2024
ధోనీ, కోహ్లీతో నన్ను పోల్చుకోను: నీరజ్ చోప్రా

జావెలిన్ క్రీడకు మరింత గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యం అని భారత్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా తెలిపారు. స్టార్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీతో తనను తాను పోల్చుకోనని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ తర్వాత తనకు మంచి గుర్తింపు వచ్చిందని, కానీ క్రికెటర్లతో పోలిస్తే అది తక్కువన్న విషయం తనకు తెలుసన్నారు. దేశంలోని ప్రతి గల్లీలో క్రికెట్ ఆడతారని, అందుకే పాపులర్ అయిందని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 2, 2026
అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ ప్రసంశలు

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్తో భారత్ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.
News February 2, 2026
DRDOలో రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టులు

<
News February 2, 2026
విడుదల కాని సినిమాకు మూడు అవార్డులు

తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో సందకరి మూవీ 3 పురస్కారాలు గెలుచుకోవడం చర్చనీయాంశమైంది. 2020 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం సహా మరో 2 విభాగాల్లో అవార్డులు దక్కాయి. అయితే ఈ సినిమా అసలు థియేటర్లలోనే విడుదల కాలేదని, అలాంటప్పుడు అవార్డులు ఎలా ఇస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. థియేటర్స్లో రిలీజైన మూవీస్నే పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధనను అతిక్రమించారంటూ విమర్శిస్తున్నారు.


