News September 22, 2024

నన్ను ధోనీతో పోల్చకండి: పంత్

image

బంగ్లాతో జరిగిన టెస్టులో భారత మాజీ కెప్టెన్ ధోనీ సెంచరీల సంఖ్యను రిషభ్ పంత్ సమం చేశారు. తనను ఆయనతో పోల్చవద్దని మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు. ‘ధోనీ భాయ్‌ జట్టైన సీఎస్కే హోం గ్రౌండ్‌లో సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. నా ఆలోచనా శైలి వేరుగా ఉంటుంది. దాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటుంటాను. చుట్టూ ఏం జరుగుతుందన్నది పట్టించుకోకుండా నా ఆటపైనే దృష్టి పెట్టడం నాకు అలవాటు’ అని తెలిపారు.

Similar News

News October 23, 2025

మిస్సింగ్ ఉద్యోగులు.. రంగంలోకి ఇంటెలిజెన్స్

image

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యలో అవకతవకలపై ఇంటెలిజెన్స్ దర్యాప్తు మొదలైందని విశ్వసనీయ సమాచారం. ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఎంతమంది, ఎంతకాలంగా పని చేస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 1.03 లక్షల మంది సమాచారం లేదు. కానీ, వీరి పేరిట పదేళ్లుగా నెలకు రూ.150కోట్ల జీతాలు జమ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది.

News October 23, 2025

తదుపరి చీఫ్ జస్టిస్ కోసం కేంద్రం కసరత్తు

image

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కొత్త సీజేఐ పేరును సిఫార్సు చేయాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌ని కోరింది. కాగా SC సీనియర్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్‌కు తదుపరి సీజేఐగా అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనుంది.

News October 23, 2025

WWC: ప్రతీకా రావల్ సెంచరీ

image

న్యూజిలాండ్‌తో మ్యాచులో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ కూడా సెంచరీ చేశారు. 122 బంతుల్లో 13 ఫోర్లతో శతకం నమోదు చేశారు. ఇప్పటికే సెంచరీ చేసిన స్మృతి మంధాన 109 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. వీరిద్దరూ 212 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ప్రతీకాతో పాటు రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 38.1 ఓవర్లకు 239/1.