News January 20, 2025

భోజనం తర్వాత ఈ రెండూ చేయకండి

image

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగొద్దు. ఎందుకంటే మనం తినే సమయంలో పొట్టలోకి జీర్ణరసాలు వచ్చి ఆహారం డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి. తినగానే నీళ్లు తాగితే ఈ రసాలు పలుచబడి జీర్ణ ప్రక్రియ ఆలస్యం అవుతుందనేది డాక్టర్ల సూచన. ఇక రాత్రి మోతాదుగా, తేలిక ఆహారం, అది కూడా పడుకునే 2-3 గంటల ముందు తింటే మంచిది. తిన్న అరగంట లోపు పడుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి లైట్ యాక్టివిటీ ట్రై చేయండి.

Similar News

News November 20, 2025

జనగామ జిల్లా ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

image

జనగాం జిల్లాలో PMDDKY అమలును ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జనగామ కలెక్టరేట్ వీసీ హాల్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, నీటిపారుదల, పౌర సరఫరాలు, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ యోజన పురోగతిపై క్షుణ్ణంగా సమీక్షించారు.

News November 20, 2025

శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

image

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.

News November 20, 2025

నటి మృతి.. అసలేం జరిగింది?

image

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్‌లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.