News August 9, 2024
ఆ భాగం రీప్లేస్ చేసేవరకు ఆల్టో కే10 నడపొద్దు: మారుతి

ఆల్టో కే10 మోడల్లో 2555 కార్లను మారుతీ సుజుకీ తాజాగా రీకాల్ చేసింది. ఒక బ్యాచ్ కార్లలో స్టీరింగ్ గేర్ బాక్స్ లోపాన్ని గుర్తించామని, ఆ కార్లు కొనుగోలు చేసిన యజమానులందరినీ సంప్రదిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. అరుదైన సందర్భాల్లో స్టీరింగ్ పనితీరు విఫలం కావొచ్చని వివరించింది. అందువలన ఆ విడిభాగాన్ని రీప్లేస్ చేసేవరకు ఆయా కార్ల యజమానులు వాటిని నడపొద్దని సూచించింది.
Similar News
News December 20, 2025
నిధికి చేదు అనుభవం.. అనసూయపైనా అవే కామెంట్స్

ఇటీవల HYD లులు మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్తో అభిమానులు దారుణంగా <<18602526>>ప్రవర్తించిన<<>> విషయం తెలిసిందే. అయితే నటి, యాంకర్ అనసూయ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ కింద ఓ నెటిజన్ ‘ఈమెను కూడా పబ్లిక్లో అలాగే చేయాలి’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన అనసూయ ఇలాంటి వాళ్లను ఏమనాలని మండిపడ్డారు. SMలో వేదికగా HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 20, 2025
నాయకులారా? ఈ సమస్య మీకు కనిపించట్లేదా?

అమ్మాయిలు, మహిళలు బయటకు వెళ్తే గుక్కెడు నీళ్లు తాగేందుకూ భయపడతారు. ఎక్కడ యూరిన్ వస్తుందేమోనని వాళ్ల భయం. ఎందుకంటే మన దేశంలో సరిపడా టాయిలెట్స్ ఉండవు. ఉన్నా క్లీన్గా ఉండవు. దీంతో అతివలు గంటల కొద్దీ బిగపట్టుకుని కూర్చుంటున్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడి <<18616284>>ప్రాణాల<<>> మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంతపెద్ద సమస్య మన నాయకులకు ఇప్పటికీ చిన్నగానే కనిపిస్తుంది. ఇప్పుడైనా మారతారేమో చూద్దాం.
News December 20, 2025
28కేసులపై 23న ప్రివిలేజ్ కమిటీ విచారణ

AP: శాసనసభ ప్రివిలేజ్ కమిటీ ఈనెల 23న సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలో తమ హక్కులకు భంగం కలిగిన ఘటనలపై శాసనసభ్యులు అందించిన ఫిర్యాదులతో పాటు సభ నుంచి అందిన ప్రతిపాదనలపై కమిటీ విచారించనుంది. వీటికి సంబంధించి బాధ్యులైన అధికారులను సమావేశానికి హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు అందించినట్లు కమిటీ అధ్యక్షుడు బి.టి.నాయుడు పేర్కొన్నారు. 28 కేసులపై చర్చించనున్నట్లు తెలిపారు.


