News April 24, 2024
బాబును నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: జోగి

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు డబ్బు తరలిస్తే మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుంటారని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ‘ఎన్నారైలు బాబును నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. వారు ప్రజా సేవ చేస్తే అభ్యంతరం లేదు. కానీ బాబును నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అందిస్తున్న జగన్కు మద్దతు తెలపాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 26, 2026
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.
News January 26, 2026
నేడు భీష్మాష్టమి.. ఇలా చేస్తే సంతాన ప్రాప్తి!

మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు. భీష్మ తర్పణం ఎలా సమర్పించాలి, భీష్మ అష్టోత్తర వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 26, 2026
బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.


