News March 21, 2024

18 ఏళ్లు నిండే వారు మర్చిపోవద్దు

image

ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే యువత ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కు పొందితే రానున్న ఎన్నికల్లో ఓటు వేయవచ్చని పేర్కొంది. నిన్న తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా.. మిగతా దశల్లో జరిగే ఎన్నికల నామినేషన్ల చివరి తేదీలు ఏప్రిల్ 1 తర్వాత ఉంటాయి. దీంతో ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారికి EC ఈ అవకాశం కల్పించింది. ఓటు హక్కు దరఖాస్తు కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 1, 2024

శృంగారం తర్వాత రక్తస్రావం.. గూగుల్లో రెమిడీస్ వెతికిన బాయ్‌ఫ్రెండ్

image

కామన్‌సెన్స్ లేకుండా ఆన్‌లైన్ రెమిడీస్ వెతకడం ఎంత డేంజరో చెప్పడానికి ఇదే ఉదాహరణ. గుజరాత్‌లో 23Yrs నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ SEP23న హోటల్‌కెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. అప్పుడామెకు విపరీతంగా రక్తస్రావమైంది. ఓ వైపు ఆమె భయపడుతోంటే అతడేమో గూగుల్లో రెమిడీస్ వెతికాడు. విలువైన సమయం వృథా కావడంతో ఆమె స్పృహ తప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు.

News October 1, 2024

రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చు.

News October 1, 2024

ఈ వికెట్ కీపర్లకు భారీ డిమాండ్

image

త్వరలో జరిగే IPL2025 మెగావేలంపై భారీ అంచనాలున్నాయి. అయితే భారీ సిక్సర్లు బాదడంతో పాటు మెరుపులా వికెట్ కీపింగ్ చేసే వారిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్, జితేశ్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. ఇషాన్‌కు MI 2022లోనే రూ.15.25కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. RR తరఫున ధ్రువ్, PBKS‌లో జితేశ్ అంచనాలకు మించే రాణించారు. వీరిలో మీ ఓటు ఎవరికి?