News April 10, 2025
ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT
Similar News
News January 21, 2026
మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోతే?

మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోయినా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా నీటితో స్నానం వీలుపడకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన పురాణాలు ఇందుకు మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, ఆతప, మానస వంటి ప్రత్యామ్నాయ స్నాన పద్ధతులను సూచించాయి. మహావిష్ణువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చేసే ‘మానస స్నానం’ అన్నింటికంటే ఉత్తమమైనది. భక్తితో భగవంతుడిని స్మరిస్తే మనసు శుద్ధి అవుతుంది. ఇలా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు.
News January 21, 2026
NPCILలో 114 పోస్టులు.. అప్లై చేశారా?

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL)లో 114 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా, BSc, టెన్త్+ITI, ఇంటర్(MPC), ఇంటర్+మెడికల్ రేడియోగ్రఫీ/X-Ray టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికెట్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అర్హతగల వారు FEB 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.npcilcareers.co.in
News January 21, 2026
గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.


