News April 10, 2025
ఈ ఐదు ఆహారాలను వేడి చేసి తినకండి!

ఆహారాన్ని పలుమార్లు వేడి చేసి తినడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆలుగడ్డను వేడి చేస్తే ఇందులో ఉండే నైట్రేట్లు వికారం, వాంతులు వంటి సమస్యలకు కారణమవుతాయి. పాలకూరలో ఉండే నైట్రేట్లు, అమినో యాసిడ్తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారొచ్చు. మష్రూమ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండె జబ్బులొస్తాయి. కోడిగుడ్డు కూడా తాజాగానే తినాలి. టీని కూడా మళ్లీ వేడి చేసి తాగొద్దు. SHARE IT
Similar News
News April 18, 2025
IPL: CSKలోకి బేబీ ABD?

సౌతాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఇన్స్టాలో యెల్లో కలర్ ఇమేజ్ను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అతడు IPLలో CSK జట్టులో చేరనున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు CSK అభిమానులు సోషల్ మీడియా వేదికగా బ్రెవిస్కు స్వాగతం చెబుతున్నారు. అయితే అతడు నిజంగానే CSKలో చేరుతారా? మరేదైనా విషయమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబీ ఏబీగా పాపులరైన బ్రెవిస్ గతంలో MIకి ఆడారు.
News April 18, 2025
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలి: కవిత

TG: గ్రూప్-1 నోటిఫికేషన్ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీఎం రేవంత్కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయన్నారు.
News April 18, 2025
విడాకుల బాటలో మరో సెలబ్రిటీ జంట?

హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.