News June 27, 2024
హెల్మెట్ లేకుంటే ఉపేక్షించొద్దు: హైకోర్టు సీరియస్

AP: వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలంది. ట్రాఫిక్ పోలీసులు బాడీవోర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరముందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలను అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది.
Similar News
News April 6, 2026
కొండపాటూరు తిరునాళ్లు.. భక్తులకు శుభవార్త

కాకుమాను (M) కొండపాటూరు పోలేరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా అధికారి డి. సాంబ్రాజ్యం తెలిపారు. గుంటూరు-1, పొన్నూరు డిపోల నుంచి 20 బస్సులు తిరుగుతాయన్నారు. గుంటూరులో ఉదయం 5.30ని.ల నుంచి ప్రతీ అరగంటకు ఒక బస్సు, పెదనందిపాడు-కొండపాటూరు మధ్య 10ని.లకు ఒక బస్సు, పొన్నూరు- కొండపాటూరుకు ప్రతీ 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందని తెలిపారు.
News April 6, 2026
‘చర్చకు సిద్ధం’.. విజయన్కు రేవంత్ కౌంటర్

TG: రాష్ట్ర పాలనపై కేరళం CM పినరయి <<19557717>>విజయన్<<>> చేసిన ట్వీట్లపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ లేఖ ద్వారా బదులిచ్చారు. విజయన్ పేర్కొన్న గణాంకాలన్నీ BRS హయాంలోనివని (2023-24) వివరిస్తూ ఆరు పేజీల లేఖ రాశారు. 28నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, రాష్ట్ర GSDP గ్రోత్ (10.1%) జాతీయ సగటు (9.9%) కంటే ఎక్కువ ఉందని పేర్కొన్నారు. APR 7న తిరువనంతపురం వచ్చి గణాంకాలతో చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
News April 6, 2026
TTD నిత్యాన్నదానం.. దాతలకు సీఎం అభినందన

AP: TTD నిత్యాన్నదాన పథకానికి సహకరిస్తున్న దాతలకు CM CBN అభినందనలు తెలిపారు. శ్రీవారి సన్నిధిలో 1985 APR 6న నాటి సీఎం NTR ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రోజుకు 2 వేల మందితో ప్రారంభమై నేడు 2.80L మందికి అన్నదానం అందించే స్థాయికి చేరిందన్నారు. ప్రస్తుతం ట్రస్ట్ మూలనిధి రూ.2,500 కోట్లు దాటిందని చెప్పారు. ఈ స్కీమ్ స్ఫూర్తితో ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులు ఏర్పాటుచేసినట్లు Xలో పేర్కొన్నారు.


