News July 12, 2024

స్మృతీ ఇరానీని అవమానించొద్దు: రాహుల్ గాంధీ

image

ప్రజలను అవమానించడం బలం కాదని, వారి బలహీనతకు నిదర్శనమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. అమేథీలో ఓడిన కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ లేదా ఇతర నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అందరికీ సూచించారు. జీవితంలో గెలుపోటములు సహజమన్నారు. కాగా 2019లో రాహుల్‌పై అమేథీలో గెలిచిన స్మృతి.. 2024లో కిశోర్ లాల్ శర్మ చేతిలో ఓడారు. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ అభిమానులు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

Similar News

News January 24, 2026

కెనడాను చైనా మింగేస్తుంది: ట్రంప్

image

చైనాతో వ్యాపారం చేస్తే కెనడాకే ప్రమాదమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ ఏర్పాటుకు మద్దతివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ‘గోల్డెన్ డోమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తోంది. నిజానికి అది వారి దేశాన్ని కూడా రక్షిస్తుంది. దానికి బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకే మొగ్గు చూపుతోంది. నిజానికి కెనడాని చైనా ఏడాదిలోనే మింగేస్తుంది’ అని పేర్కొన్నారు.

News January 24, 2026

ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

image

iPhone 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్‌తో కాకుండా అండర్‌ డిస్‌ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్‌తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్‌ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్‌ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.

News January 24, 2026

468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

image

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్‌పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్‌తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్‌లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.