News September 14, 2024

BRSలో ఉన్నప్పుడు ఆంధ్ర అని తెలీదా?: ఇందిరా శోభన్

image

TG:బతకడానికి <<14083308>>వచ్చావంటూ<<>> MLA గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ ఖండించారు. ‘గాంధీ BRSలో ఉన్నప్పుడు AP నుంచి వచ్చారని తెలీదా? ఇన్నాళ్లు ఓట్ల కోసం సెంటిమెంట్‌తో KCR రాజకీయాలు చేశారు. ఆంధ్రావారికి ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని ఓట్లు వేయించుకోలేదా?’ అని ప్రశ్నించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌పై చర్యలకు ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News December 27, 2025

రైతు రామారావు ఫ్యామిలీకి అండగా ఉంటాం: CBN

image

AP: తన సమస్యను చెప్పుకొని గుండెపోటుతో మరణించిన అమరావతి రైతు రామారావు కుటుంబ సభ్యులను CM CBN ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా నిన్న మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రైతు <<18679475>>రామారావు<<>> ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు.

News December 27, 2025

మండలాలు పక్క జిల్లాల్లోకి!

image

AP: <<18685889>>పునర్విభజనలో<<>> గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని CM చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో, రైల్వే కోడూరును తిరుపతిలో, పొదిలిని ప్రకాశంలో, రాజంపేటను కడపలో, రాయచోటి(అన్నమయ్య)ని మదనపల్లెలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అటు ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలని అభిప్రాయపడ్డారు.

News December 27, 2025

చైనా ఆంక్షలు.. వెండి ధరకు రెక్కలు?

image

2026 నుంచి వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలు విధిస్తోంది. ఇకపై సిల్వర్‌ను విదేశాలకు పంపాలంటే లైసెన్స్ తప్పనిసరి. సోలార్ ప్యానెల్స్, EVs, మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారీలో ఈ లోహం చాలా కీలకం. గ్లోబల్‌ మార్కెట్లో 60-70% వెండి చైనా నుంచే వస్తోంది. దీంతో గ్రీన్ ఎనర్జీ, టెక్ రంగాల్లో ఇబ్బందులు రావొచ్చని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు మరింత పెరగొచ్చని నిపుణుల అంచనా.