News September 14, 2024

BRSలో ఉన్నప్పుడు ఆంధ్ర అని తెలీదా?: ఇందిరా శోభన్

image

TG:బతకడానికి <<14083308>>వచ్చావంటూ<<>> MLA గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ ఖండించారు. ‘గాంధీ BRSలో ఉన్నప్పుడు AP నుంచి వచ్చారని తెలీదా? ఇన్నాళ్లు ఓట్ల కోసం సెంటిమెంట్‌తో KCR రాజకీయాలు చేశారు. ఆంధ్రావారికి ముళ్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని ఓట్లు వేయించుకోలేదా?’ అని ప్రశ్నించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్‌పై చర్యలకు ఆమె డిమాండ్ చేశారు.

Similar News

News December 7, 2025

ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్‌పై ఛార్జిషీట్

image

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.

News December 7, 2025

గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

image

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News December 7, 2025

రోహిత్, కోహ్లీలు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారంటే?

image

ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసుల్లో పరుగుల వరదతో అభిమానులను అలరించిన రో-కో జోడీ మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో మైదానంలో అడుగుపెట్టనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఆ సిరీస్ తర్వాత మళ్లీ జులైలో ENGతో మూడు వన్డేలు ఉన్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోన్న రోహిత్, కోహ్లీలు విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడనున్నారు.