News April 4, 2024

ఏ పార్టీయో తెలీదు గానీ పోటీ చేస్తా: రఘురామ

image

AP: వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాననే నమ్మకం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతానో తెలియదని చెప్పారు. ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీపైనా స్పష్టత లేదని పేర్కొన్నారు. మూడు, నాలుగు రోజుల్లో మంచి వార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Similar News

News December 23, 2025

Money Tip: కోటి రూపాయలు ఉన్నాయా? ఈ చేదు నిజం తెలుసుకోండి!

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు కొనుగోలు శక్తి ఏటేటా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం సగటున 5% ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేస్తే నేటి ₹కోటి విలువ పదేళ్ల తర్వాత దాదాపు ₹61.37 లక్షలకు పడిపోతుంది. ఈరోజు ₹కోటితో కొనే వస్తువులు లేదా ఆస్తులను పదేళ్ల తర్వాత కొనాలంటే సుమారు ₹1.62 కోట్లు అవసరమవుతాయి. అందుకే కేవలం పొదుపుపైనే కాకుండా ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడినిచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.

News December 23, 2025

‘ఈ ఏడు కాకుంటే.. వచ్చే ఏడాదైనా మారుతుంది’

image

ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా, శరీరాన్ని తాకట్టుపెట్టి, సాగులోనే మనసును బందీ చేసి, ఆత్మని పొలంలోనే పాతిపెడతాడు అన్నదాత. చర్మం మండేలా కాసే ఎండలోనైనా, ఎముకల కొరికే చలినైనా, కుండపోత వర్షమైనా దేనినీ లెక్క చేయకుండా సేద్యం చేస్తూ, తన పంటను కాపాడుకొనేందుకు పగలు, రాత్రి కష్టపడతాడు. ప్రకృతి ప్రకోపంతో పంట కోల్పోయినా.. ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాదైనా పరిస్థితి మారుతుందనే ఆశతో జీవించే ఏకైక వ్యక్తి ‘రైతు’.

News December 23, 2025

మిరపలో వేరుపురుగు నివారణకు సూచనలు

image

మిరపలో వేరు పురుగు నివారణకు ముందుగా వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. క్లోరిఫైరిఫాస్ 8 మి.లీ ఒక కిలో విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవ సంబంధిత మెటారైజియం ఎనాయిసోప్లి వేర్ల దగ్గర పోయాలి. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 5-10 కిలోలు పొడి ఇసుకతో కలిపి నేలలో తేలికపాటి తడి ఉన్నప్పుడు సాళ్ల వెంట వేసుకోవాలి. అలాగే ఎకరాకు 10కిలోల వేపపిండి వేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.