News December 4, 2024

కర్పూరం వెలిగించవద్దు, హారతి ఇవ్వొద్దు: అయ్యప్పలకు రైల్వే సూచన

image

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రైళ్లలో వెళ్లే మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైలు కోచ్‌లలో కర్పూరం, అగరబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే యాక్ట్ 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ చర్యలతో రైలులో అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వివరించింది.

Similar News

News October 20, 2025

మేకప్ తీయడానికి ఈ జాగ్రత్తలు

image

మేకప్ వేసుకోవడంలోనే కాదు దాన్ని తీసే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. లేదంటే ముఖ చర్మం దెబ్బతింటుంది. మేకప్ తీసేటపుడు ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. కాటన్ ప్యాడ్‌పై మేకప్ రిమూవర్ వేసి ముఖానికి అద్ది కాసేపటి తర్వాత క్లీన్ చెయ్యాలి. కళ్ల చివర్లు, పెదాలు, మెడ, చెవులు, హెయిర్‌లైన్‌ ప్రాంతాల్లోనూ మేకప్ తియ్యాలి. కుదిరితే ముఖానికి ఆవిరి పట్టి ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.

News October 20, 2025

2023లో ఎంతమంది పుట్టారంటే?

image

దేశవ్యాప్తంగా 2023 JAN 1 నుంచి DEC 31 వరకు జిల్లాల వారీగా నమోదైన జనన, మరణాలపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(CRS) నివేదికను కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. APలో 7,62,093 జననాలు, 4,42,218 మరణాలు, TGలో 6,52,688 జననాలు, 2,40,058 మరణాలు నమోదయ్యాయి. జననాల్లో APలో కర్నూలు, కడప, అనంతపురం, TGలో HYD, NZB, కామారెడ్డి తొలి 3 స్థానాల్లో నిలిచాయి. 2 రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనూ లక్షకుపైగా జననాలు నమోదు కాలేదు.

News October 20, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

దీపావళి వేళ బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి ₹1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150 పతనమై రూ.1,198,00గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.1,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.