News December 4, 2024

కర్పూరం వెలిగించవద్దు, హారతి ఇవ్వొద్దు: అయ్యప్పలకు రైల్వే సూచన

image

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి రైళ్లలో వెళ్లే మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైలు కోచ్‌లలో కర్పూరం, అగరబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే యాక్ట్ 67, 154, 164, 165 సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించి మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ చర్యలతో రైలులో అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని వివరించింది.

Similar News

News November 18, 2025

సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

News November 18, 2025

సచివాలయాలకు పర్యవేక్షకులు వీరే..

image

AP: గ్రామ, వార్డు సచివాలయాలకు మండల స్థాయిలో పర్యవేక్షకులుగా 660 మంది డిప్యూటీ MPDOలను ప్రభుత్వం నియమించనుంది. అలాగే జిల్లా స్థాయిలో పర్యవేక్షకులుగా ZP CEO, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించనుంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే. A కేటగిరీలో ఆరుగురు, Bలో 7, Cలో ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటారు.

News November 18, 2025

మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం

image

AP: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య సహా ఆరుగురు మావోలు మరణించారు. హిడ్మా కోసం పలు రాష్ట్రాల పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీమ్ సెక్రటరీగా ఉన్నాడు.