News April 19, 2024
పొరపాటు చేయొద్దు.. పసుపుపతి నిద్రలేస్తాడు: జగన్

AP: చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు. ‘టీడీపీకి ఓటేస్తే పసుపుపతి నిద్రలేచి వదల బొమ్మాళి వదల అంటాడు. చంద్రబాబు కత్తిరింపులు మొదలవుతాయి. గోరు ముద్ద రద్దు. విద్యా దీవెన, వసతి దీవెన అమ్మఒడి రద్దు. పేదవాడికి వైద్యం అందకుండా చేస్తుంది ఈ చంద్రముఖి. అక్కాచెల్లెమ్మలకు బతుకులు అతలాకుతలం అవుతాయి. ఫ్యాన్కి ఓటేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.
Similar News
News November 18, 2025
‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.
News November 18, 2025
ఓటమికి 100% బాధ్యత నాదే: ప్రశాంత్ కిశోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.


