News October 26, 2024
రెండు రోజులు ఎవ్వరినీ కలవను: జానీ మాస్టర్

చంచల్గూడ జైలు నుంచి విడుదలైన <<14447920>>జానీ మాస్టర్<<>> తన ఇంట్లో ఓ డైరెక్టర్, ఇద్దరు కొరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘జైలులో పెట్టే ఆహారం తినలేకపోయా. మనిషి అనే వాడు జైలుకు వెళ్లకూడదు. బయట కంటే జైలులో నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తా. అప్పటి వరకూ ఎవరితో మాట్లాడను. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’ అని చెప్పినట్లు సమాచారం.
Similar News
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<
News November 27, 2025
డిసెంబర్లో నింగిలోకి రోబో: ఇస్రో ఛైర్మన్

ఏడాదికి 50 శాటిలైట్ల చొప్పున వచ్చే మూడేళ్లలో 150 శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. విపత్తులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా శాటిలైట్లను ప్రయోగిస్తున్నామన్నారు. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఈ డిసెంబర్లో నింగిలోకి రోబోను పంపేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు నారాయణన్ చెప్పారు.


