News October 26, 2024
రెండు రోజులు ఎవ్వరినీ కలవను: జానీ మాస్టర్
చంచల్గూడ జైలు నుంచి విడుదలైన <<14447920>>జానీ మాస్టర్<<>> తన ఇంట్లో ఓ డైరెక్టర్, ఇద్దరు కొరియోగ్రాఫర్లతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ‘జైలులో పెట్టే ఆహారం తినలేకపోయా. మనిషి అనే వాడు జైలుకు వెళ్లకూడదు. బయట కంటే జైలులో నరకంగా ఉంటుంది. ఇలా ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. రెండు రోజులు గడిస్తే నార్మల్ పరిస్థితికి వస్తా. అప్పటి వరకూ ఎవరితో మాట్లాడను. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’ అని చెప్పినట్లు సమాచారం.
Similar News
News October 26, 2024
డెమోక్రాట్లను టెన్షన్ పెడుతున్న మిచిగాన్
7 స్వింగ్ స్టేట్స్లో ఒకటైన మిచిగాన్ డెమోక్రాట్లను టెన్షన్ పెడుతోంది. ఇక్కడ దాదాపు 4 లక్షల వరకు ఉన్న అరబ్ అమెరికన్స్ మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులను బైడెన్ నియంత్రించలేకపోయారని అసంతృప్తితో ఉన్నారు. 2020 ఎన్నికల్లో బైడెన్కు పట్టం కట్టిన మిచిగాన్ ఈ సారి బైడెన్, అయన విధానాలను వ్యతిరేకించని కమలపై గుర్రుగా ఉన్నారు. దీంతో మిచిగాన్ డెమోక్రాట్లను టెన్షన్ పెడుతోంది.
News October 26, 2024
‘సరస్వతి’ భూముల్లో సర్వే
AP: మాజీ CM జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ భూముల్లో ప్రభుత్వం సర్వే చేపట్టింది. పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో ఉన్న భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. కాగా వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సరస్వతి పవర్ కంపెనీకి ఎకరా రూ.3 లక్షల చొప్పున 1,515.93 ఎకరాలు కేటాయించారు. ప్రస్తుతం వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. వీటిలో అటవీ భూములు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
News October 26, 2024
‘కూలీ’ తర్వాత తలైవాతో నెల్సన్ సెకండ్ మూవీ
సూపర్ స్టార్ రజినీకాంత్తో మరోసారి సినిమా చేసేందుకు నెల్సన్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం తలైవా లోకేశ్ కనగరాజ్తో కలిసి ‘కూలీ’ సినిమా తీస్తున్నారు. ఈ షూటింగ్ పూర్తికాగానే నెల్సన్ ప్రాజెక్ట్ మొదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, అది కచ్చితంగా ‘జైలర్-2’ అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జైలర్’ మంచి విజయాన్ని అందుకోగా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.