News September 20, 2024
భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు: పవన్

AP: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టుల్లో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News December 10, 2025
ప్రయాణికుల ప్రైవేట్ వీడియోలు తీసి..

ప్రయాణికుల ప్రైవేటు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఘటన UPలో జరిగింది. కొత్తగా పెళ్లైన జంట పూర్వాంచల్ హైవేపై కారులో రొమాన్స్ చేస్తుండగా స్థానిక టోల్ప్లాజా సిబ్బంది అశుతోష్ సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేశాడు. తర్వాత వీడియో చూపించి వారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. మనీ ఇచ్చినా వీడియోను SMలో వైరల్ చేశాడు. దీనిపై పోలీసులకు కంప్లైట్ ఇవ్వగా అశుతోష్ అలాంటి వీడియోలెన్నో రికార్డ్ చేసినట్లు తేలింది.
News December 10, 2025
జిమ్కి వెళ్లేముందు మేకప్ వేసుకుంటున్నారా?

జిమ్కి వెళ్లేటపుడు మేకప్ వేసుకోవడం చర్మం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా వ్యాయామం చేసేప్పుడు చర్మరంధ్రాలు విస్తరిస్తాయి. కానీ మేకప్ వేసుకుంటే చర్మరంధ్రాలు విస్తరించకుండా మేకప్ అడ్డుగా ఉంటుంది. దీంతో సెబమ్ ఉత్పత్తి తగ్గి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు, స్కిన్ ఇరిటేషన్ వంటివి వస్తాయని చెబుతున్నారు. వ్యాయామం చేసేప్పుడు మేకప్ వేసుకోకపోతే చర్మం సహజంగా మెరుస్తుందని తెలిపారు.
News December 10, 2025
సోషల్ మీడియాతో పిల్లల్లో ఏకాగ్రత లోపం!

సోషల్ మీడియా వినియోగం పిల్లలలో ఏకాగ్రత లోపానికి దారితీసి ADHD లక్షణాలను పెంచుతుందని స్వీడన్కు చెందిన కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడైంది. ‘SM వాడటం వల్ల పిల్లలు ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు. ఇది వారి మెదడు అభివృద్ధిపై, ముఖ్యంగా ఏకాగ్రత సామర్థ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోంది. పిల్లల స్క్రీన్ టైమ్ను తగ్గించడంపై పేరెంట్స్ దృష్టిసారించాలి’ అని నివేదిక సూచించింది.


