News September 20, 2024
భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు: పవన్

AP: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టుల్లో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News December 20, 2025
మల్లన్న భక్తులకు ఊరట

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్లో ఎక్కువగా వెళ్తున్నారు.
News December 20, 2025
వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.
News December 20, 2025
సన్న బియ్యం బోనస్ జమ కాకపోతే ఏం చేయాలి?

TG: వరి సన్నాలు సాగు చేసిన రైతుల అకౌంట్లలో సర్కారు బోనస్ జమ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే బోనస్ పడుతుంది. ఒకవేళ రైతు ఖాతాల్లో బోనస్ జమ కాకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలి. పౌరసరఫరాలశాఖ వెబ్సైట్లోని ‘ఫార్మర్ కార్నర్’లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ను సంప్రదించాలి.


