News September 20, 2024
భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు: పవన్

AP: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టుల్లో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బ తీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News December 23, 2025
ఎక్కువగా వ్యాయామం చేస్తున్నారా? మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే!

వ్యాయామం ఎక్కువగా చేస్తే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గుండె పనితీరుపై భారం పడి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. హార్ట్బీట్లో మార్పులు కనిపిస్తాయి. ఛాతీ నొప్పి, పాల్పిటేషన్స్, మయోకార్డిటిస్, అలసట సమస్యలు ఎక్కువవుతాయి. తలతిరగడం, గుండె కండరాల్లో వాపు ఏర్పడే ప్రమాదం ఉంది. బీపీ పెరిగి హార్ట్ బీట్లో మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ హార్ట్ ఇష్యూస్కు దారితీసే ప్రమాదం ఉంది.
News December 23, 2025
OFFICIAL: వారణాసిలో నటిస్తున్న ప్రకాశ్ రాజ్

మహేశ్-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ చిత్రంలో విలక్షణ నటుడు <<18570987>>ప్రకాశ్ రాజ్<<>> నటిస్తున్నారంటూ గాసిప్స్ వైరలైన విషయం తెలిసిందే. తాను వారణాసి చిత్రంలో నటిస్తున్నట్లు ఇప్పుడు స్వయంగా ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ‘వారణాసి షూటింగ్లో అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. రాజమౌళి, మహేశ్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రాకు థాంక్స్. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
News December 23, 2025
‘పల్లె వెలుగు’ బస్సులూ EV ACవే ఉండాలి: CBN

AP: RTCలో ప్రవేశపెట్టే బస్సులు, ‘పల్లెవెలుగు’ అయినా సరే ఎలక్ట్రికల్ ఏసీవే ఉండాలని CM CBN అధికారులను ఆదేశించారు. ‘వచ్చే ఏడాది కొనే 1450 బస్సులూ ఈవీనే తీసుకోవాలి. 8819 డీజిల్ బస్సుల స్థానంలో EVలనే పెట్టండి. 8 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటినీ మార్చాలి. తిరుమల- తిరుపతి మధ్య రవాణాకు 300 ఈ-బస్సులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది’ అని వివరించారు. బస్సుల మెయింటెనెన్సును ప్రైవేటుకు అప్పగించాలని సూచించారు.


