News September 2, 2024

నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు సీఎంగారూ: కేటీఆర్

image

TG: పదేళ్ల పాటు సిరి సంపదలతో కళకళలాడిన సిరిసిల్ల ఇప్పుడు ఉరిసిల్లగా మారుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. ‘నేతన్నల పట్ల కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురు తీస్తోంది. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు సీఎంగారూ. మాకన్నా ఎక్కువ మంచి చేసి వారి ప్రాణాలు నిలబెట్టండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 2, 2025

వసంత పంచమి ఎప్పుడు? క్లారిటీ

image

వసంతి పంచమి ఇవాళా? రేపా? అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ‘ఇవాళ ఉ.9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. ఆ తర్వాత పంచమి మొదలవుతుంది. రేపు ఉ.6.50 నిమిషాలకు సూర్యోదయం ఉంటే, పంచమి తిథి ఉ.6.52 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 నిమిషాలకు పర్వదినాన్ని నిర్ణయించలేం. అందుకే 2వ తేదీనే పండుగ చేసుకోవాలి. ఇవాళ ఉ.7:09 గంటల నుంచి మ.12:35 గంటల వరకు పూజకు మంచి సమయం’ అని చెబుతున్నారు.

News February 2, 2025

వసంత పంచమి: ఏం చేయాలి?

image

✒ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి. సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.
✒ ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.
✒ ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
✒ ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.

News February 2, 2025

హోమ్ లోన్ తీసుకునే వారికి వడ్డీ సబ్సిడీ

image

2025-26లో హోం లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 10 లక్షల మందికి వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద ప్రయోజనం చేకూర్చనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ₹3,500Cr కేటాయించింది. ఎలా? ఏ విధంగా లబ్ధి కలిగిస్తుందనేది వెల్లడించలేదు. PMAY(అర్బన్)కు ₹19,794Cr, PMAY(గ్రామీణ్)కు ₹54,832Cr ఇచ్చింది. 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.