News August 30, 2024
ఇసుక పంపిణీలో రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావొద్దు: ముకేశ్ కుమార్

AP: ఉచిత ఇసుక సరఫరా విషయంలో కలెక్టర్లు రోజువారీ సమీక్షలు చేసుకోవాలని గనులు, అబ్కారీ శాఖ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా సూచించారు. ఏమాత్రం రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావొద్దని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 11 నుంచి అమలులోకి రానున్న నూతన ఇసుక పాలసీపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్పై అవగాహన లేని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం సచివాలయంలో ఓ ఉద్యోగిని కేటాయించాలని సూచించారు.
Similar News
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.
News November 21, 2025
పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.


