News February 28, 2025
ఈశా ఫౌండేషన్ పై చర్యలు తీసుకోవద్దు: సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ కేసులో హైకోర్టు తీర్పు సరైనదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఫౌండేషన్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తమిళనాడు వెల్లియంగిరిలోని ఫౌండేషన్కు పర్యావరణ అనుమతులు లేవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసులు జారీచేసింది. దీంతో ఈశా ఫౌండేషన్ హైకోర్టును సంప్రదించింది. నిర్మాణం సక్రమంగానే జరిగిందని హైకోర్టు నోటీసులను కొట్టివేయడంతో బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


