News August 5, 2024

ఆ వంతెనను కూల్చొద్దు: ఆనంద్ మహీంద్రా

image

కేరళ వయనాడ్‌లో ప్రకృతి విపత్తు భారీ విధ్వంసం సృష్టించింది. సహాయక చర్యల్లో భారత ఆర్మీ గంటల వ్యవధిలోనే తాత్కాలిక వంతెనను నిర్మించింది. దీంతో పలు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ఏర్పడింది. ఒకవేళ ఈ ప్రాంతంలో కొత్త వంతెనను నిర్మించినా ఈ బ్రిడ్జిని కూల్చవద్దని వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కోరారు. ఇది భారత ఆర్మీకి గౌరవ సూచికగా ఉండటమే కాకుండా వారు ఇచ్చిన భద్రతను గుర్తు చేస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News December 18, 2025

రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే NBW.. కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

image

ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించే బిల్లును కర్ణాటక అసెంబ్లీ నేడు ఆమోదించింది. కులం/మతం/వ్యక్తిని రెచ్చగొట్టే కామెంట్లకు 1-7ఏళ్ల జైలు, రూ.50వేల ఫైన్ విధిస్తామని బిల్లులో పేర్కొంది. రిపీట్ చేస్తే 2ఏళ్ల జైలు, రూ.లక్ష ఫైన్ వేస్తారు. నేర తీవ్రత ప్రకారం బాధితుడికి పరిహారమిచ్చే అవకాశమూ ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బిల్లు తెచ్చిందని BJP విమర్శించింది.

News December 18, 2025

భారీ జీతంతో NCRTCలో ఉద్యోగాలు

image

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(NCRTC) 5 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టును బట్టి BE, B.Tech, PG, మేనేజ్‌మెంట్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. Dy.GMకు పేస్కేల్ రూ.70వేలు-రూ.2లక్షలు, Asst.మేనేజర్‌కు రూ.50,000 -రూ.1,60,000 ఉంది. వెబ్‌సైట్: www.ncrtc.co.in

News December 18, 2025

బీర సాగులో మంచి ఆదాయానికి సూచనలు

image

బీరపంట సాధారణంగా విత్తిన 45 రోజులకు కోతకు వస్తుంది. బీరను నేల మీద కాకుండా పందిరి, స్టేకింగ్ పద్ధతిలో సాగు చేస్తే ఎక్కువ రోజుల పాటు అధిక దిగుబడి వస్తుంది. చీడపీడలు తగ్గి, కాయ నాణ్యత బాగుంటుంది. కోతకు వచ్చిన కాయలను రోజు తప్పించి రోజు కట్ చేసి మార్కెటింగ్ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే కాయ లావుగా మారి ధర తగ్గే ఛాన్సుంది. ఉదయమే తెంపి మార్కెట్‌కు తీసుకెళ్తే అవి మరింత తాజాగా కనిపించి ఎక్కువ ధర వస్తుంది.