News September 25, 2024
ఈ సిటీల్లో నాన్ వెజ్ ముట్టుకోరు!
అసలు మాంసాహారమే ముట్టుకోని నగరాలు కూడా భారత్లో ఉన్నాయి. శ్రీరాముడు జన్మించినట్లు చెప్పే అయోధ్య, కృష్ణుడు తిరుగాడినట్లు చెప్పే బృందావనం, నరనారాయణులు తపస్సు చేసిన రిషీకేశ్, జైనులకు పవిత్రమైన పాలిటానా, మౌంట్ అబూ, బ్రహ్మదేవుడి ఆలయానికి పేరొందిన పుష్కర్ నగరాల్లో నాన్ వెజ్ నిషేధం. గుజరాత్లోని గాంధీనగర్లో నిషేధం లేకపోయినా అక్కడి వారు స్వచ్ఛందంగా మాంసాహారానికి దూరం పాటిస్తారు.
Similar News
News September 25, 2024
షాహిన్ అఫ్రీదికి గాయం.. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు దూరం?
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు పాకిస్థాన్కు షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రీదికి గాయమైంది. దీంతో అతడు టెస్ట్ సిరీస్కు దూరమయ్యే ఛాన్సుంది. ఛాంపియన్స్ వన్డేకప్లో డాల్ఫిన్స్తో జరుగుతున్న మ్యాచ్లో అతను గాయపడ్డాడు. మోకాలికి బంతి బలంగా తాకడంతో తీవ్రంగా గాయపడి మైదానాన్ని వీడారు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు. OCT 7 నుంచి ఇంగ్లండ్తో సిరీస్ ప్రారంభం కానుంది.
News September 25, 2024
కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే తెలివి లేదు: మాజీ మంత్రి
TG: రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రైతు భరోసాని అమలు చేయాలన్నారు. తెలంగాణలో పోలీస్ రాజ్యం మొదలుపెట్టారని అన్నారు. పోలీసులు నిబంధనలు అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షార్హులు అవుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప, కొత్తవి నిర్మించే తెలివి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
News September 25, 2024
ఉక్రెయిన్కు మా మద్దతు కొనసాగుతుంది: బైడెన్
ఉక్రెయిన్లో శాంతి నెలకొనే వరకూ ఆ దేశానికి తమ మద్దతు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నాటో మిత్ర దేశాలు కలిసికట్టుగా ఉండటంతో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విఫలమైందని పేర్కొన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కొత్తగా నాటోలో చేరడంతో మరింత బలం చేకూరిందని చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభంతోపాటు సూడాన్లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.