News March 16, 2024
రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దు: ఎస్పీ

ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సిరిసిల్ల జిల్లాలో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. ఆధారాలు ఇస్తే గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందన్నారు.
Similar News
News October 22, 2025
బేడ బుడగ జంగం సమస్యలపై మంత్రికి వినతి

బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణు, బుధవారం HYDలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. SC వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ల పరంగా ఏ గ్రూపులో ఉన్న ఉద్యోగాలు, పదోన్నతులు ఇతర గ్రూపులకు తరలించకుండా బ్యాక్ లాగ్ పోస్టులుగా ఉంచాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో బేడ బుడగ జంగాలకు తగు న్యాయం చేయాలని మంత్రిని కోరినట్లు వేణు తెలిపారు.
News October 22, 2025
KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.
News October 22, 2025
కరీంనగర్: రేపే లాస్ట్ డేట్.. 27న డ్రా

కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అని, రూ.3 లక్షల రూపాయల డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస రావు తెలిపారు. నిన్నటి వరకు 2,639 దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు అప్లికేషన్స్ సమర్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్స్లను ఈనెల 27న నిర్వహించే లాటరీ ద్వారా దక్కించుకోవాలని సూచించారు.


