News June 2, 2024
మీ టైమ్ వృథా చేసుకోవద్దు: ప్రశాంత్ కిశోర్

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాల మేరకు వెలువడటంతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి Xలో స్పందించారు. ‘ఎన్నికలు, రాజకీయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు నకిలీ జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, నేతల పనికిమాలిన విశ్లేషణలు చూస్తూ మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు’ అని రాసుకొచ్చారు. ఎన్నికల్లో BJPకి 300+ సీట్లు ఖాయమని, APలో కూటమిదే అధికారమని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.
News November 21, 2025
24 నుంచి కొత్త కార్యక్రమం

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు.
News November 21, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


