News August 24, 2024

డెంగ్యూ కేసులపై ఆందోళన వద్దు: హెల్త్ డైరెక్టర్

image

TG: వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని డీహెచ్ రవీందర్ తెలిపారు. డెంగ్యూ కేసులపై ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ‘ఈ ఏడాది ఇప్పటివరకు 4,600కు పైగా కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఖమ్మం సహా 10 జిలాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. HYD జిల్లాలో 1,697 కేసులు నమోదయ్యాయి. ఇంటింటి సర్వే, పరీక్షలు చేస్తూ చికిత్స అందిస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News December 28, 2025

భారత్ ఖాతాలో మరో విజయం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న 5 T20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో IND 4-0 లీడ్ సాధించింది.

News December 28, 2025

బ్యాడ్మింటన్‌లో గోల్డ్ సాధించిన చరిష్మ.. CBN, లోకేశ్ అభినందనలు

image

AP: విజయవాడలో జరిగిన 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్-2025 ఉమెన్స్ సింగిల్స్‌లో రాష్ట్రానికి చెందిన సూర్య చరిష్మ తమిరి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్ షిప్‌లో ఆంధ్రా జట్టు సిల్వర్ గెలిచింది. తొలి గోల్డ్ మెడల్ సాధించిన చరిష్మ, సిల్వర్ గెలిచిన టీమ్‌ను CM చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందించారు.

News December 28, 2025

సీఎం రేవంత్‌ కీలక సమీక్ష.. వ్యూహం సిద్ధం!

image

TG: అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో CM రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో నదీజలాల పంపకం, TG వాటా, APతో వివాదాలు, BRS హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరిగింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.