News July 13, 2024
ఫ్యాన్స్ బాధపడొద్దు.. వాళ్లు ఇంకా ఆడతారు: వీవీఎస్ లక్ష్మణ్

టీ20ఐలకు రోహిత్, విరాట్, జడేజా వీడ్కోలు పలకడంపై భారత జట్టు అభిమానులు చాలామంది బాధపడ్డారు. వారికి టీమ్ ఇండియా తాత్కాలిక కోచ్ VVS లక్ష్మణ్ ఉపశమనం కలిగించే మాటలు చెప్పారు. ఆ ముగ్గురూ భారత్కు ఇంకా చాలా రోజులు ఆడతారని ఆయన అన్నారు. ‘వన్డే, టెస్టు ఫార్మాట్లలో వారి సేవలు అమూల్యమైనవి. ఆ ఫార్మాట్లలో వాళ్లు కచ్చితంగా దేశానికి మరిన్ని ట్రోఫీలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News February 10, 2026
US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.
News February 10, 2026
దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.
News February 10, 2026
బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.


