News July 13, 2024
ఫ్యాన్స్ బాధపడొద్దు.. వాళ్లు ఇంకా ఆడతారు: వీవీఎస్ లక్ష్మణ్

టీ20ఐలకు రోహిత్, విరాట్, జడేజా వీడ్కోలు పలకడంపై భారత జట్టు అభిమానులు చాలామంది బాధపడ్డారు. వారికి టీమ్ ఇండియా తాత్కాలిక కోచ్ VVS లక్ష్మణ్ ఉపశమనం కలిగించే మాటలు చెప్పారు. ఆ ముగ్గురూ భారత్కు ఇంకా చాలా రోజులు ఆడతారని ఆయన అన్నారు. ‘వన్డే, టెస్టు ఫార్మాట్లలో వారి సేవలు అమూల్యమైనవి. ఆ ఫార్మాట్లలో వాళ్లు కచ్చితంగా దేశానికి మరిన్ని ట్రోఫీలు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
ఎన్నికలపై విచారణ వాయిదా

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.
News November 24, 2025
హనుమాన్ చాలీసా భావం – 19

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥
సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలో ఎగిరిన బలవంతుడు హనుమ. అలాంటిది శ్రీరాముని ఉంగరంతో సముద్రాన్ని దాటడం ఆశ్చర్యాన్ని కలిగించదు. హనుమంతుని అద్భుత శక్తులు తెలిసిన తర్వాత సముద్ర లంఘనం ఆయనకు ఎంతో సులువు అని కవి ఉద్దేశం. దైవకార్య సాధనలో ఎంత కష్టమైన పనైనా సునాయసంగా పూర్తవుతుందనే సందేశం ఈ దోహా ఇస్తోంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 24, 2025
INDSETIలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు

ఇండియన్ బ్యాంక్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ <


