News August 24, 2025

ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా?: KTR

image

TG: కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేస్తే రేవంత్ ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.2.20 లక్షల కోట్ల అప్పు చేసిందని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి BRS కేడర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘ఎవరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ పార్టీ మారారు? ఈ 20 నెలల్లో ఏం అభివృద్ధి చేశారు? ఏ పార్టీలో ఉన్నారో చెప్పేందుకు ధైర్యం లేదా? ఉప ఎన్నికలో గెలిచే దమ్ము ఉందా?’ అని ప్రశ్నించారు.

Similar News

News August 24, 2025

103 శాటిలైట్స్, చంద్రయాన్-8.. ఇస్రో ప్లాన్ ఇదే!

image

ఇస్రో ఫ్యూచర్ ప్లాన్‌పై స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించారు. ‘2025-2040 వరకు భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ 15 ఏళ్లలో సెక్యూరిటీ, సర్వైలెన్స్, ఎర్త్ అబ్జర్వేషన్, ల్యాండ్, ఓషన్ అప్లికేషన్స్ తదితర 103 శాటిలైట్స్ లాంచ్ చేయనున్నాం. చంద్రయాన్-4,5,6,7,8 మిషన్స్ ప్లాన్ చేస్తున్నాం. బెస్ట్ స్పేస్ ఫెయిరింగ్ నేషన్‌గా భారత్ ఎదుగుతుంది’ అని వ్యాఖ్యానించారు.

News August 24, 2025

రాత్రి కొబ్బరినూనె తాగితే ఎన్ని ప్రయోజనాలంటే?

image

రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ‘రాత్రి ఒక టీస్పూన్ కొబ్బరినూనె తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లు తాగాలి. ఇలా చేస్తే శరీరంలో పైత్యరసం సక్రమంగా ఉత్పత్తి జరిగి మలబద్ధకం తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి గాఢ నిద్ర పడుతుంది. లివర్‌, శరీరంలో కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.

News August 24, 2025

రేపట్నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: నాదెండ్ల

image

AP: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘1.46 కోట్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రేపటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది. ATM కార్డు సైజు, క్యూఆర్ కోడ్‌తో ఈ కార్డు ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇది CM చంద్రబాబు ఆధ్వర్యంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం. నాదెండ్ల మనోహర్‌కు ధన్యవాదాలు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.