News October 23, 2024
గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు!
TG: గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి మరణించిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య (41) ఇంట్లో మద్యం తాగి దోశ తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో కేరళలో ఇడ్లీలు తినే పోటీలో ఓ వ్యక్తి ఇడ్లీలు తింటూ ఊపిరాడక చనిపోయాడు.
Similar News
News October 23, 2024
24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి
AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.
News October 23, 2024
ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్
కేరళలోని వయనాడ్ లోక్సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.
News October 23, 2024
AQI స్కోర్: ఇండియాను బీట్ చేసిన పాక్
దాయాది పాకిస్థాన్ బ్యాడ్ రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరమున్న దేశంగా అవతరించింది. AQI 394తో లాహోర్ మన ఢిల్లీని బీట్ చేసింది. సాధారణంగా Air Quality Index 100 ఉంటేనే ఆరోగ్యానికి మంచిదికాదు. ఇక 150 అయితే భయంకర రోగాలు అటాక్ చేస్తాయి. అలాంటిది 394 అంటే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ, కిన్షాసా, ముంబై, మిలనో, ఉలన్ బాటర్, కరాచీ సిటీస్ లాహోర్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.