News August 20, 2024
రెట్టింపైన న్యూజిలాండ్ వీసా ఫీజు!

ఉన్నత చదువుల కోసం న్యూజిలాండ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటోన్న విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. భారతీయ విద్యార్థులకు వీసా రుసుము పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రూ.19,000 ఉన్న ఫీజును రెండింతలు చేసి రూ.38,190కి పెంచింది. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. గతేడాది న్యూజిలాండ్కు వెళ్లిన విద్యార్థుల సంఖ్య భారీగా పెరగ్గా భారత్, చైనా నుంచే అధికంగా ఉన్నారు.
Similar News
News January 10, 2026
OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<
News January 10, 2026
MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.


