News March 20, 2024

27న చరణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

image

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సాన బుచ్చిబాబుతో చేయబోయే మూవీ నుంచి కూడా ఓ క్రేజీ అప్డేట్ రానుందని టాక్. దీంతో చరణ్ పుట్టినరోజున అభిమానులకు పండగనే చెప్పాలి. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Similar News

News July 3, 2024

నేడు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, తూ.గో., ప.గో., కృష్ణా తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.

News July 3, 2024

రేపు స్వదేశానికి భారత జట్టు!

image

హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు BCCI సెక్రటరీ జైషా అనుమతించారని చెప్పారు. ఈ క్రమంలో మీడియా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా రేపు ఉదయం కల్లా విమానం ఢిల్లీ చేరే అవకాశముంది.

News July 3, 2024

సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్@80,000

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 560 పాయింట్లకుపైగా లాభపడిన సెన్సెక్స్ తొలిసారిగా 80వేల మార్క్ తాకింది. మరోవైపు నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,277 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు కలిసొచ్చింది. HDFC, యాక్సిస్, ICICI, కోటక్ బ్యాంకుల షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఐటీ మినహా ఇతర ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.