News July 26, 2024
T20 లీగ్లోకి ద్రవిడ్ కుమారుడు ఎంట్రీ

టీమ్ ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ టీ20 లీగ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటక మహారాజా ట్రోఫీ లీగ్లో ఆయన మైసూర్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. రూ.50 వేలకు సమిత్ను ఆ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ జట్టుకు కరుణ్ నాయర్ కెప్టెన్గా ఉండనున్నారు. మైసూర్తోపాటు హుబ్లీ టైగర్స్, శివమొగ్గ లయన్స్, గుల్బర్గా మిస్టిక్స్, బెంగళూరు బ్లాస్టర్స్, మంగళూరు డ్రాగన్స్ పోటీ పడనున్నాయి.
Similar News
News November 16, 2025
ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.
News November 16, 2025
లైటింగ్ పెంచడంతోనే పేలుడు!

J&K నౌగామ్ పోలీస్ స్టేషన్లో జరిగిన <<18295101>>పేలుడుకు<<>> అధిక లైటింగే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘ఫరీదాబాద్ ఉగ్ర నెట్వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో ద్రవరూప రసాయనాలు కూడా ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ బృందాలు లైటింగ్ పెంచాయి. దీంతో వెలువడిన వేడి లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చిన పొగలు ఆ రసాయనంతో కలిసి పేలుడు జరిగి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
ధర్మబద్ధంగా జీవించడమే స్వర్గానికి మార్గం

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం|
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్||
అన్ని ధర్మాలు తెలిసిన, మనందరికీ కీర్తిని, అభివృద్ధిని ఇచ్చే ప్రపంచ నాయకుడు, గొప్పవాడు, సకల జీవరాశికి పుట్టుకకు, ఉనికికి మూలమైనవాడు విష్ణుమూర్తి. ఆయన బోధించిన ధర్మాన్ని మనం మన జీవితంలో పాటించాలి. సకల సృష్టికి మూలమైన ఆయనను స్మరిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే స్వర్గానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


