News December 17, 2024

భారీగా పడిపోయిన ఎండు మిర్చి ధర

image

TG: ఎండు మిర్చి ధర క్వింటాకు రూ.7వేల వరకు తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత ఏడాది ఇదే నెలలో క్వింటా ఎండు మిర్చి గరిష్ఠంగా రూ.23వేలు పలకగా, ప్రస్తుతం రూ.12వేల నుంచి రూ.16వేలు పలుకుతోంది. విదేశీ మార్కెట్‌కు మిర్చి ఎగుమతులు తగ్గడమే ధరల తగ్గింపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, WGL, NZB, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మిర్చి అత్యధికంగా సాగవుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 16, 2026

విజయ్‌ హజారే ట్రోఫీ.. పైనల్‌కు దూసుకెళ్లిన విదర్భ

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ క్రికెట్ జట్టు కర్ణాటకపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 280 పరుగులు చేసింది. దర్శన్ నల్కాండే ఐదు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌లో విదర్భ యువ బ్యాటర్ అమన్ మొఖాడే 138 రన్స్‌తో సత్తా చాటారు. మరోవైపు ఈరోజు పంజాబ్-సౌరాష్ట్ర మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్ 18వ తేదీన విదర్భతో ఫైనల్‌లో తలపడనుంది.

News January 16, 2026

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్.. సీక్రెట్ చెప్పిన సోనూ సూద్

image

52 ఏళ్ల వయసులోనూ సిక్స్ ప్యాక్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు నటుడు సోనూ సూద్. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఏంటో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లేవగానే గోరువెచ్చని నీరు తాగుతానని, అనంతరం రోజూ గంటపాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ఇతర వర్కౌట్స్‌తో పాటు ధ్యానం చేస్తానని తెలిపారు. పెద్దగా డైట్ ఫాలో అవ్వనని, హోమ్ ఫుడ్‌ని లిమిటెడ్‌గా తీసుకుంటానని వెల్లడించారు. ఇక షూటింగ్‌లలో ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానని అన్నారు.

News January 16, 2026

ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

image

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.