News January 31, 2025

రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఎండు మిర్చి

image

TG: ఎండు మిర్చి ధరలు రోజురోజుకు పడిపోతుండటంతో పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో క్వింటాల్‌కు గరిష్ఠ ధర ₹23వేలు ఉండగా, ప్రస్తుతం ₹15వేలు కూడా దాటడం లేదని చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈ వారం గరిష్ఠ ధర ₹14,800 పలికింది. తాజాగా ₹14,000కు తగ్గింది. నిన్న అత్యధిక కొనుగోళ్లు ₹11,000 నుంచి ₹13,000 మధ్యే జరిగాయని రైతులు తెలిపారు.

Similar News

News January 7, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్: CBN
* స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు: APSRTC
* ‘రాయలసీమ’పై రేవంత్‌తో కలిసి CM కుట్ర: YCP
* ఐదు రోజుల పాటు సాగిన TG అసెంబ్లీ, శాసన మండలి
* ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు: భట్టి
* మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్: పొంగులేటి
* KCR అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది: కేటీఆర్

News January 7, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందువు.. మూక దాడి నుంచి తప్పించుకోలేక..

image

బంగ్లాదేశ్‌లో మరో హిందువు బలయ్యాడు. నవ్‌గావ్‌లోని మహాదేవ్‌పూర్‌లో దొంగతనం చేశాడంటూ మిథున్ సర్కార్‌(25)ను మూక వెంటాడింది. దీంతో తప్పించుకునే దారి లేక, ప్రాణాలను కాపాడుకునేందుకు అతడు కాలువలోకి దూకాడు. ఈత రాక నీట మునిగి చనిపోయాడు. సాయం కోసం అర్థించినా ఎవరూ కనికరించలేదు. ఇటీవల హిందువులపై ఇలాంటి <<18775269>>ఘటనలు<<>> జరుగుతూనే ఉన్నాయి.

News January 7, 2026

ధనవంతులైనా విచారణను ఎదుర్కోవాల్సిందే: SC

image

విచారణను తప్పించుకోవడానికి ధనవంతులు చట్ట నియమాలను సవాల్ చేయడాన్ని CJI తప్పుబట్టారు. ఇలాంటి వాటిని అనుమతించేది లేదన్నారు. సాధారణ పౌరుల మాదిరి వారూ కోర్టు విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేశారు. అగస్టావెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ డీల్ స్కామ్‌ కేసులో PMLA చట్టంలోని 44(1,c) ని సవాల్ చేస్తూ గౌతమ్ ఖేతాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. ధనవంతుడిని కాబట్టి స్పెషల్ హియరింగ్ ఇవ్వాలనడం సరికాదన్నారు.