News January 31, 2025
రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న ఎండు మిర్చి

TG: ఎండు మిర్చి ధరలు రోజురోజుకు పడిపోతుండటంతో పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో క్వింటాల్కు గరిష్ఠ ధర ₹23వేలు ఉండగా, ప్రస్తుతం ₹15వేలు కూడా దాటడం లేదని చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ వారం గరిష్ఠ ధర ₹14,800 పలికింది. తాజాగా ₹14,000కు తగ్గింది. నిన్న అత్యధిక కొనుగోళ్లు ₹11,000 నుంచి ₹13,000 మధ్యే జరిగాయని రైతులు తెలిపారు.
Similar News
News November 28, 2025
‘పిచ్చుకల పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి’

కాకినాడ జిల్లాలోని ప్రతి విద్యార్థికి స్వయంగా ధాన్యం కుంచె తయారీ నేర్పించి, పిచ్చుకల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తునికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు పి. దాలినాయుడు కోరారు. గురువారం ఆయన కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ షాన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పిచ్చుకల పరిరక్షణకు తాను చేపట్టిన కార్యక్రమం వివరాలను ఆయన కలెక్టర్కు వివరించారు.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్


