News April 18, 2024

డ్రైవర్ అన్నలూ.. నిర్లక్ష్యంతో ప్రాణాలు తీయకండి

image

రోడ్డుపై నిలిపి ఉంచిన లారీలు, భారీ వాహనాలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారులపై బ్రేక్ డౌన్ అవడం, విశ్రాంతి కోసం కొంతమంది లారీ డ్రైవర్లు ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఆపేస్తున్నారు. దీంతో వేగంగా వచ్చే కార్లు వెనుక నుంచి ఢీకొడుతున్నాయి. నిన్న వడోదరలో ఈ తరహా ప్రమాదంలో 10 మంది మరణించారు. రోడ్డుపై లారీలు ఆపకూడదు. ఒకవేళ ఆపాల్సి వస్తే ఇండికేటర్స్ ఆన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
SHARE IT

Similar News

News October 16, 2025

50 ఏళ్ల వయసులో సింగర్ రెండో పెళ్లి!

image

సింగర్ రఘు దీక్షిత్ 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. సింగర్, ఫ్లూటిస్ట్ వారిజశ్రీ వేణుగోపాల్(34)ను ఈ నెలాఖరున ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. 2005లో డాన్సర్ మయూరి ఉపాధ్యాయతో ఆయనకు వివాహం జరగగా 2019లో విడాకులు తీసుకున్నారు. రఘు తెలుగులో శ్రీమంతుడు, S/O సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాల్లో పాటలు పాడారు. కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో పలు చిత్రాలకు సంగీతం అందించారు.

News October 16, 2025

వంట చేయకపోతేనే హ్యాపీగా ఉంటారట!.. హార్వర్డ్ స్టడీ

image

తమ భర్తల కోసం వంట చేసేవారితో పోల్చితే చేయని స్త్రీల వైవాహిక జీవితమే సంతోషంగా ఉన్నట్లు హార్వర్డ్ అధ్యయనం తెలిపింది. ‘మహిళ నిత్యం వంట చేయడం వల్ల ఆమె తెలియకుండానే సేవకురాలిగా మారిపోతుంది. దీనివల్ల భాగస్వామ్య భావన తగ్గి, వైవాహిక సంతృప్తి కూడా తగ్గుతుంది’అని అధ్యయనం పేర్కొంది. 15 ఏళ్లపాటు 12వేల విదేశీ జంటలపై సర్వే చేయగా వంట చేసేవారు వైవాహిక జీవితంపై 6.1/10 ఇస్తే చేయనివారు 8.4/10 మార్కులిచ్చారు.

News October 16, 2025

క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

image

TG: రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టితో భేటీ అయిన సురేఖ.. సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. ఇటీవల నెలకొన్న <<18020734>>వివాదాలతో<<>> ఆమె మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.